FLASH

tml"/>Get this Widget"WELCOME TO OUR UNION BLOG "
tml"/>Get this Widget" యూనియన్ వార్తలు, గవర్నమెంట్ ఆర్డర్స్ ,సర్కులర్స్,లేటెస్ట్ న్యూస్ ల తో మీ ముందుకు వస్తున్నాము.మీ యొక్క మద్దత్తు కోరుతూ మీ సెక్రటరీ [KONDABABU] "

13, ఏప్రిల్ 2021, మంగళవారం

Greetings

Dear Comrades

U - ఉత్సవం

G - గౌరవం

A - ఆనందం

D - ధనం

I - ఐశ్వర్యం

తెచ్చేదే ఉగాది పండుగ..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు

17, మార్చి 2021, బుధవారం

Article for Media

*/పత్రికా ప్రకటన/*

*తపాలా శాఖలో ఎన్నో ఏళ్లుగా ఆవిష్కృతంగా ఉన్న సమస్యలపై  సమర శంఖాన్ని పూరిస్తూ NFPE ఆధ్వర్యంలో ఉద్యోగులు ఈరోజు రాజమండ్రి డివిజినల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి,రంపచోడవరం ,కొత్తపల్లి,మండపేట,రామచంద్రపురం లాంటి సుదూర ప్రాంతాల నుండి జిడిఎస్,పి4,పి3 సభ్యులు వచ్చి ధర్నాలో ఉత్సహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తి,LIC ప్రధాన కార్యదర్శి సతీష్ వచ్చి ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపారు.కేంద్ర పాలకులు అవలంభిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై  సవివరంగా వివరించారు.NFPE అనుబంధ  సంఘం అయిన ఆల్ ఇండియా పెన్షనర్ అసోసిషన్ కార్యదర్శి తిరుపతి రావు గారు  పాల్గొని ధర్నాకు మద్దతు తెలిపారు.NFPE పి3 డివిజన్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ నోట్ల రద్దు సమయంలో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యేక భత్యం ఇవ్వాలని,కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని,టార్గెట్ల పేరిట జిడిస్,పోస్టుమాన్ ఉద్యోగులను వేధించడం ఆపాలని,నెట్వర్క్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో NFPE పి4 కార్యదర్శి జె.వి.సతీష్,అధ్యక్షులు శ్రీనివాస్,పి3 కార్యదర్శి కొండబాబు,అధ్యక్షులు యూ.జి.ప్రకాష్ ,జిడిస్ కార్యదర్శి పుష్కరం,అధ్యక్షులు లక్ష్మణరావు,రామచంద్రపురం బ్రాంచ్ పి3 కార్యదర్శి రమణ మూర్తి, అధ్యక్షులు జి.శ్రీనివాస్, పి4 కార్యదర్శి బాబ్జి,అధ్యక్షులు ఈశ్వర రావు,జిడిస్ కార్యదర్శి ఎండి షరీఫ్  తదితరులు పాల్గొన్నారు.*

Evening session of Dharna programme

Dharna programme

11, మార్చి 2021, గురువారం

RT 2021 Timelines

NFPE circular

Postman

పోస్ట్ పోస్ట్ ‌ అని పిలుస్తూ
సైకిల్‌ బెల్‌ గణగణ మోగిస్తూ

సొంత వాడిలా పలకరిస్తూ
ఉత్తరాలని చదివి వినిపిస్తూ

పెదాలపై చిరునవ్వు చిందిస్తూ
శుభ వార్తలను చేరవేస్తూ

పల్లె పల్లెల్లో ప్రతీరోజూ ప్రతీ గుమ్మం తలుపు తడుతూ 
ప్రతీ వీధిలో పోస్ట్ మేన్ తిరిగిన రోజులు

కొన్నాళ్ల క్రితం వరకు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉండేవి...


ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతూ
వాట్సాప్ లో స్టేటస్ లు పెడుతూ

ఆన్లైన్లో వార్తలు చదువుతూ
అర నిమిషం లో డబ్బులు పంపుతూ

అరచేతితో ప్రపంచాన్ని ఏలుతూ
హోమ్ డెలివరీ కి అలవాటు పడుతూ

దేనికోసమైనా గూగుల్ తల్లినే అడుగుతూ కదులుతున్న రోజులు మన కళ్ళ ముందు కదులుతున్నాయి... కదులుతూనే ఉంటాయి.

రోజూ కోట్లాది ఉత్తరాలు, మని ఆర్డర్లు,పార్శిళ్ల బట్వాడా ద్వారా జనజీవితంతో మమేకమైన తపాలా వ్యవస్థ ....అంతర్జాలం, చరవాణుల సాంకేతిక విప్లవం తో నిన్న మొన్న వరకు ఒక అడుగు వెనక్కి ఉందనే చెప్పుకోవచ్చు.

కానీ ...

నేడు ఈ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి తిరిగి తేరుకుని కొత్త శక్తి పుంజుకుని తపాలా శాఖ ముఖచిత్రం మార్చడానికి  నాంది పలుకుతుంది

మన.... ఇండియా పోస్ట్

పల్లెల నుండి పట్నం వరకు ప్రతీ భారతీయుని ఇంటి వద్దకు నూతన సాంకేతిక విజ్ఞానంతో అన్ని రకాలా తపాలా సేవలను అందించడానికి సంసిద్దమవుతోంది మన " ఇండియా పోస్ట్".

మారుతున్న కాలంతో పాటు మిగతా అన్ని సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ మేము తక్కువ కాదు అంటూ అక్షరాస్యుల అరచేతి లోనే కాదు నిరక్ష రాస్యుల ఇంటి వాకిట ముందు కూడా నిరంతరంగా సేవలను అందించడానికి సిద్దమైంది మన"" ఇండియా పోస్ట్""

ఎప్పుడూ.... 
        ఇప్పుడూ....
                ఎప్పుడూ....

ప్రతీ క్షణం ప్రజా సేవలో.... ఇండియా పోస్ట్


🇮🇳జై హింద్🇮🇳

SB orders

SB Order 02/2021 : Enhancement of limit of withdrawals at GDS Branch post offices from 5000/- to 20000/- without obtaining sanction/approval from Account Office 


SB Order No. 03/2021 : Regarding revision of cash acceptance limit in GDS Branch post offices and cash transaction limit at other SOLs.


Inter SOL transactions limit revised to Rs.50000/- For BO also cash limit enhanced to Rs.50000/-

All POSB cheques issued by any CBS Post office if presented at any CBS Post Office shall be treated as AT PAR cheques and shall not be sent for clearing. No cash transaction for more than Rs. 50,000/- shall be allowed at other SOLs in an account in a day.

Round table meeting at LIC union building towards privatization of government sector

Directorate clarification on RTs 2021

8, మార్చి 2021, సోమవారం

press note on women's day celebrations

*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  NFPE యూనియన్ ఆధ్వర్యంలో తపాలా శాఖలో  రాజమండ్రి  డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద  మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  రాజమండ్రి డివిజన్ సూపరింటెండెంట్ సిహెచ్.సూర్యనారాయణ,అసిస్టెంట్ సూపరింటెండెంట్లు కె. శ్రీధరం,జి.రామకృష్ణ,హెడ్ పోస్టుమాస్టార్ అప్పారావు గారు పాల్గొని అంతర్జాతీయ మహిళ దినోత్సవ విశిష్టతను తెలియచేసారు.NFPE మహిళా కన్వీనర్ ప్రసూనాంబ గారు మాట్లాడుతూ మహిళల గొప్పతనాన్ని వివరించారు.NFPE మహిళా కమిటీ ట్రెజరర్ శ్రీమతి గంటా రాజేశ్వరి గారు తన గానామృతంతో సభికులను అలరించారు.ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి ప్రధానతపాలా కార్యాలయం,దానవాయిపేట,ఆర్యాపురం,శ్రీరామ్ నగర్,గోకవరం,రామచంద్రపురం,మండపేట,అనపర్తి కార్యాలయాలలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు.*

international women's day celebrations

2, మార్చి 2021, మంగళవారం

Latest patches deployed in Finacle

Latest Patches deployed in Finacle CBS

Posted by Admin

Mar 2, 20210 comments

Respected Sir / Madam,

Details of CBS patches deployed in last 15 days is provided below:

SCS accounts can be closed prematurely within one year with closure reason code as EXP; penal interest will be deducted automatically during closure; user needs to visit Closure Details tab to check penal fee / penal interest related parameters before submitting closure.

During account opening, nomination is mandatory for all schemes, irrespective of mode of operation - SB / RD / TD / MIS / KVP / NSC / SCSS / PPF / SSA.

Nature of entitlement is mandatory for nominees and needs to be updated while adding nominee for new accounts / existing accounts; during modification of accounts, nominee details are to be updated.

Error thrown during cancellation of modification of MIS / TD accounts is resolved.

PLI Mccamish is integrated with CBS. For PLI policies monthly subscription can be paid by POSB cheques / debiting from POSB accounts and PLI payments can be credited to POSB accounts of the customers.

In addition, customers can also pay their PLI subscription through E-Banking / Mobile Banking.

Charges for cheque leaves more than 10 in a calendar year will be deducted automatically from the customer's SB account.

Charges to be collected for various operations like transfer of accounts / pledging / duplicate passbook issue as per GSPR can be collected using HGCHRG menu and receipt printed through HADVC can be handed over to the customer. Detailed SOP is sent to Circles via SB order no. 01/2021 dated 23/02/2021​


With regards

Giriraj Ponnambalam
CBS Team Lead
Centre for Excellence in Postal Technology, Chennai 600002

7, ఫిబ్రవరి 2021, ఆదివారం

Article on privatization of vizag steel plant

*/విశాఖ ఉక్కు-ప్రై'వేటు' హక్కు/*

*"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు'' అని మనం ఇంత వరకు విన్నాం.ఇక నుంచి ఆ పదాల్లో ఒకటి మారబోతున్నది.''విశాఖ ఉక్కు ప్రైవేటు హక్కు'' అని నినదించాల్సి ఉంటుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.ఈ ప్లాంట్ లో వంద శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయం  తీసుకుంది.విశాఖపట్నం స్టీలు ప్లాంటును 100% ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే గత బుధవారం ట్వీట్‌ చేశారు. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సంస్థపై యాజమాన్య హక్కులను వదులుకొని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.ఈ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలతో పాటు అన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టనున్నారు.కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.2018-19 బడ్జెట్ లోనే 34 శాతం వాటాను విక్రయించేందుకు సన్నాహాలు చేశారు. అయితే.. అప్పట్లో ఉద్యమం తెరమీదికి రావడంతో ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కు ఇప్పటికే 3వేల ఎకరాలు కట్టబెట్టారు.ప్రస్తుతం ఈ నవరత్న సంస్థలో  కేంద్ర ప్రభుత్వానికే 100% వాటాలున్నాయి.*

*✊స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన అతి పెద్ద ఫ్యాక్టరీ విశాఖఉక్కు కర్మాగారం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని గొంతెత్తి, తెన్నేటి విశ్వనాథం ఆధ్వర్యంలో తెలుగు వాళ్ళు చేసిన నినాదాలు అలల ఘోషతో పోటీపడ్డాయి.రాజీపడని, అలుపెరగని ఆ పోరాటం సాగరతీరాన తొలి ఉక్కుకర్మాగారానికి పురుడు పోసింది.కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఆ కర్మాగారం విశాఖ రూపురేఖలను మార్చివేసింది.ఈ సంస్థపై ప్రస్తుతం 18వేల మంది శాశ్వత కార్మికులు,మరో 18వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారు.పరోక్షంగా లక్షలాది మందికి జీవనాధారంగా ఉంది. ఈ ప్లాంట్ ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపేణా ప్రతి ఏడాది సుమారు రూ.30వేల కోట్లు వస్తున్నాయి.స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై రాష్ట్రమంతా విస్తరించింది.ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్‌ ప్లాంట్‌ను,విశాఖను విడదీసి చూడలేం.ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది.*

*చరిత్రలోకి వెళితే..*

*👉1964 శీతాకాల సమావేశాల్లో పరిశ్రమల ప్రణాళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగినపుడు, ''పరిశ్రమల విషయంలో మొదటి మూడు  పంచవర్ష ప్రణాళికల్లో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సరిచేయటానికి ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్పాలి.అలా నెలకొల్పే వరకూ అసమతుల్యత తొలగిపోదు.రాష్ట్రాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు'' అని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆ డిమాండ్‌కు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు పి.వెంకటేశ్వర్లు (సీపీఐ), టి.నాగిరెడ్డి (సీపీఎం), జి.లచ్చన్న (స్వరాజ్య), తెన్నేటి విశ్వనాథం (నేషనల్ డెమొక్రాట్స్), వావిలాల గోపాల కృష్ణయ్య (ఇండిపెండెంట్) తదితరులు మద్దతిచ్చారు.*

*👉అయితే.. ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం మీద మొదట హిందుస్తాన్ స్టీల్ ఇచ్చిన నివేదిక.. విశాఖపట్నానికి అనుకూలంగా లేదు. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు. ఆయన.. 1965 జనవరి 27న బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం (బీఏఎస్ఐసీ - బేసిక్) పేరిట ఒక సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించారు.ఉక్కు పరిశ్రమను స్థాపించటానికి అనువైన ప్రదేశం గురించి నిష్పాక్షిక నిపుణుల అభిప్రాయం తెలుసుకోవటం ఆ కన్సార్షియం ఏర్పాటు లక్ష్యం.ఇది ఆరు వేర్వేరు స్థలాలు విశాఖపట్నం, బైలదిలా, గోవా, హోస్పేట్, సేలం, నైవేలీలను పరిశీలించింది. ఆ బృందం 1965 జూన్ 25వ తేదీన సమర్పించిన నివేదికలో దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. సముద్ర తీరంలో అత్యంత అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది. భూమి మీద హోస్పేట కూడా చాలా అనువైన స్థలమని పేర్కొంది.ఈ రెండు స్థలాల మధ్య ముడి సరకు రవాణాకు దూరం దగ్గరగా ఉండడంతో పాటు.. ఓడరేవు కూడా ఉన్న విశాఖపట్నం అన్ని విధాలా అనువైన ప్రాంతమని స్పష్టంచేసింది.కానీ ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హోస్పేటలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మొగ్గు చూపింది.*

*👉దీనితో 1966 లో ఆంధ్రప్రదేశ్ అంతటా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. ఉద్యమం అనతికాలంలోనే ఊపందుకుని ఆ ఏడాది నవంబర్ ఒకటో తేదీన.. విశాఖపట్నంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.ఆ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు,మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు.ఆ రోజు విశాఖతో పాటు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. తర్వాత మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో కర్మాగారం ఏర్పాటును ప్రకటించింది.1971లో శంకుస్థాపన చేస్తే.. రెండు దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయి పని ప్రారంభించింది.1971న నాటి ప్రధాని ఇందిరా గాంధీ విశాఖ ఉక్కు పరిశ్రమకు శంఖుస్థాపన చేశారు.ఆమె మరోసారి ప్రధానిగా ఉండగానే 1981 నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రారంభమై ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.*

*👉విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించినప్పుడు సుమారు 22 వేల ఎకరాల భూమిని సేకరించారు.తొలినాళ్లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నా స్టీల్ ప్లాంట్ వాటన్నింటిని అధిగమించి 21,851 కోట్ల టర్నోవరు సాధించే స్థాయికి చేరింది.నాలుగేళ్లలో 203.6% వృద్ధి సాధించింది.2002 సంవత్సరం నుంచి 2015 వరకు వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో కేంద్రానికి చెల్లించింది.2010 నవంబరు 17న దీనికి నవరత్న హోదా కల్పించారు. దేశంలో అతిపెద్ద సింగిల్‌ సైట్‌ ప్లాంటు ఇదే.*

*ఇదీ నష్టాల చరిత్ర...*

*👉ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ సంస్థ.. 2015 నుంచి వరుసనష్టాల్లో కూరుకుపోయింది.సొంత గనులు లేకపోవడమే అందుకు కారణమని పార్లమెంటు స్థాయీసంఘం గుర్తించింది.దేశంలో సొంత గనులు లేని ఏకైక భారీ ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ఒక్కటే. దీంతో ఇనుప ఖనిజం, థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్ ల కోసం ఒడిషా మినరల్ డవలప్ మెంట్ కార్పోరేషన్‍,బిస్రా స్టోన్ లైమ్ కంపెనీలపై ఆధారపడుతోంది.మార్కెట్ రేట్లకు అనుగుణంగా బయటి నుంచి ముడిసరుకును కొనుగోలు చేయడంతో విక్రయించే ప్రతి టన్ను స్టీలుపైన ఐదు వేల రూపాయలు కోల్పోవాల్సి వస్తోంది.తద్వారా సంస్ధపై ఏటా మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతోంది.ఇప్పుడు ఆ నష్టాల కారణంగానే కేంద్రప్రభుత్వం దీన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడానికి సిద్ధమైంది.2015-16లో రూ.1,420.64 కోట్లు, 2016-17లో రూ.1,263.16 కోట్లు, 2017-18లో రూ.1,369.01 కోట్ల నష్టం చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం మార్కెట్‌ పరిస్థితులు, చైనా నుంచి వచ్చే చౌక దిగుమతులే.2018-19లో రూ.96.71 కోట్ల లాభం సంపాదించింది. విస్తరించిన యూనిట్ల నుంచి ఉత్పత్తిని పెంచి, మార్కెట్‌ను మెరుగుపరుచుకొంది.కానీ 2019-20 తొలి త్రైమాసికం నాటికి మళ్లీ రూ.636.78 కోట్ల నష్టాలు చవిచూసింది. సొంత గనులు లేక ముడిసరకునంతా బయటినుంచి కొనాల్సి వస్తోంది.కొన్నేళ్లుగా బహిరంగమార్కెట్‌లో ఇనుప ఖనిజం,బొగ్గు ధరలు పెరగడంతో రూ.4వేల కోట్ల భారాన్ని మోయాల్సి వచ్చింది.ఆధునికీరణ, విస్తరణ చేపట్టడంతో పెద్దఎత్తున ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. 2018తో పోలిస్తే 2019 జూన్‌నాటికి ఉక్కు ఉత్పత్తి ఖర్చులు దాదాపు 7% పెరిగాయి. సంస్థను లాభాలబాటలో నడపడానికి మెకెన్సీ సంస్థను కన్సల్టెంటుగా పెట్టుకొన్నారు. వాళ్ల సూచనలు పాటిస్తే నష్టాల నుంచి బయటపడుతుందని అందరూ భావించారు. దేశంలో స్టీలుకు డిమాండు పెరుగుతుండటంతో భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఆశించారు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటీకరణకు సిద్ధమైంది.*

*✊ఒక సమస్యకు పరిష్కారం లేనప్పుడు,ప్రత్యామ్నాయం లేనప్పుడు దానిని పరిష్కరించడం కష్టతరమవుతుంది.అదే సమస్యకు పరిష్కారం కళ్ళముందే కనిపిస్తున్నా ప్రత్యామ్నాయం పక్కనే ఉన్నా పరిష్కారం కావడం లేదంటే… లోపం సమస్యలో లేదు సమస్యను పరిష్కరించే ఆలోచనలో ఉందని అర్థం చేసుకోవాలి.విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ విషయంలోనూ కేంద్రం వైఖరి ఇదే తెలియజేస్తోంది.ప్రయిడ్ ఆఫ్ ఇండియా అంటూ గర్వంగా నిలబడ్డ భారీ పరిశ్రమను ప్రయివేట్ పరం చేయడం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని మార్కెట్లో పెట్టడమే.ఇప్పటికయినా కేంద్ర పాలకులు నీతిఆయోగ్ నిర్ణయాల ప్రకారం కాకుండా ప్రజా నిర్ణయం ప్రకారం నడుచుకుంటేనే వారు పాలక పక్షంలో ఉంటారు లేదంటే ప్రతిపక్షమే....*

*✊పోరాడితే పోయేదేమీ లేదు. ఉక్కు సంకెళ్లు తప్ప✊*

25, జనవరి 2021, సోమవారం

Demonstrations programme

*✊ఫిబ్రవరి '1' వ తేదీన నిరసన కార్యక్రమాలు✊*

*డియర్ కామ్రేడ్స్,*

*తపాలా శాఖలో దీర్ఘకాలంగా ఆవిరిష్కృతంగా ఉన్న న్యాయమైన డిమాండ్లను వెంటనే  పరిష్కరించాలని కోరుతూ,నిలిపివేసిన కరువు భత్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి '1' వ తేదీన  అన్ని తపాలా కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.అదే రోజు సాయంత్రం '5' గంటలకు రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.సుమారు 50 రోజులుగా దేశ రాజధానిలో ఎముకలు కొరికే చలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ తమకు ఎదురులేదని విర్రవీగుతున్న మోడీ ప్రభుత్వాన్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న రైతుల పోరాటస్పూర్తితో ప్రతీ ఒక్కరూ మన డిమాండ్ల పరిష్కారం కోసం చేసే ఈ పోరాటంలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ....*

       *మీ*

*బి.కొండబాబు*

13, జనవరి 2021, బుధవారం

greetings

Dear Comrades, 
🌹💐
 *'భోగి'* *భోగభాగ్యాలతో ...

*'సంక్రాంతి'* సిరి సంపదలతో కళకళలాడుతూ...

*'కనుమ'* కనువిందుగా జరుపు కోవాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ..... 

మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక పండుగ శుభాకాంక్షలు*.......🤝💐🌹

- DS Rajahmundry